బెండలపాడులో సమీక్ష నిర్వహించిన మంత్రి

BDK: చండ్రుగోండ మండలం బెండాలపాడులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ లతో జిల్లా అధికారులతో సీఎం పర్యటనపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, హెలిప్యాడ్, బహిరంగసభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జరగబోయే కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు.