టీ స్టాల్స్ యజమానులను హెచ్చరించిన ఎస్సై
SRPT: టీ స్టాల్స్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్నగర్ పట్టణ ఎస్సై బండి మోహన్ అన్నారు. ఇవాళ HNR పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న మూడు టీ స్టాల్స్ను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత షాపు యజమానులదే అని హెచ్చరించారు.