‘మోసపోయిన బాధితులకు న్యాయం చేయండి’
W.G: ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఇళ్ల స్థలాల పేరట తమని పలువురు మోసం చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ సీపీఎం పార్టీ గ్రామ సెక్రెటరీ ఇల్లింద్రపత్తి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని స్థలాలు ఇవ్వకుండా వారిని మోసం చేయడం అనేది దారుణమన్నారు. అధికారులు స్పందించి తక్షణమే బాధితులకు న్యాయం చేసి మోసగాళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు.