VIDEO: గోదావరిలో విద్యార్థి మృతదేహం లభ్యం
MLG: మంగపేట మండలం పొదుమూరు వద్ద గోదావరిలో యువకుడు రాజుకుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైంది. సోమవారం గోదావరి ఒడ్డున అతని చెప్పులు, బ్యాగు, సెల్ఫోన్ లభించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గజ ఈతగాళ్లు, జాలర్ల సహాయంతో గోదావరిలో గాలింపు చేపట్టగా మృతదేహం బయటపడింది. మృతుడు హైదరాబాద్లో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.