జీసీసీ ఎండీగా బాధ్యతల స్వీకరణ
VSP: గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ (జీసీసీ) నూతన వైస్ ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్.ఎస్. శోబిక గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అరకువ్యాలీ కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించారు. గిరిజనుల జీవనోపాధుల అభివృద్ధికి అందరూ నిబద్ధతతో పనిచేయాలని ఆయన కోరారు.