బస్సు జాత కార్యక్రమం జయప్రదం చేయండి: CPI
MLG: ములుగు, మల్లంపల్లి మండలాల CPI కార్యకర్తల సమావేశం ఇవాళ మండల కార్యదర్శి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. బస్సు జాత కార్యక్రమాన్ని కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు. భారత గడ్డపై సీపీఐ పార్టీ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 20న బస్సు జాత కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ అంజాద్ పాషా తెలిపారు.