విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారికి చేసిన వివిధ సేవల ద్వారా రూ. 80,157 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 64 మంది స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, 8 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా.. 1300 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.