జర్నలిస్ట్లకు ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభం
తిరుపతిలో అమర ఆసుపత్రిలో అక్రెడిటెడ్ జర్నలిస్ట్ల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి 10 వరకు జరుగనున్న ఈ క్యాంప్లో తొలి రోజు వివిధ రక్త పరీక్షలు, ఈసీజీతో పాటు గుండె, దంత, ఈఎన్టి, గైనకాలజీ విభాగాల వైద్య సేవలు అందించారు. జిల్లాలోని జర్నలిస్ట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.