పత్తి కొనుగోళ్లలో ఈ నిబంధనను ఎత్తేయాలి: రాజిరెడ్డి
NLG: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే CCI విధించిన 7 క్వింటాళ్ల నిబంధనను వెంటనే ఎత్తివేయాలని BRS రైతు విభాగం జిల్లా నాయకుడు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్లో ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు వర్షాలకు పత్తి చేలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోగా మరోవైపు CCI తీసుకొచ్చిన నిబంధన రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అవేదన వ్యక్తం చేశారు.