గోమాత కళ్యాణానికి కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం

గోమాత కళ్యాణానికి కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్లోని శ్రీశ్రీ అంబత్రేయ క్షేత్రంలో ఈనెల 12న నిర్వహించనున్న గోమాత కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్, ఎస్పీ డా. వినీత్ కుమార్లను ఆహ్వానించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, అయ్యప్పలు వారికి ఆహ్వాన పత్రాలు అందించారు. హిందూ సంప్రదాయంలో గోమాత కళ్యాణం ఎంతో విశిష్టమైనదని తెలిపారు.