VIDEO: 'సతీష్ కుమార్ను వైసీపీ నాయకులే హత్య చేశారు'
సత్యసాయి: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడైన సీఐ సతీష్ కుమార్ను వైసీపీ నాయకులే హతమార్చారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. శుక్రవారం మడకశిరలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఐను హత్య చేసి తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్పై పడేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ వివేకా హత్య కేసులో సాక్షులను కూడా ఇలాగే హతమార్చారని తెలిపారు.