'కూటమి పాలనలో రహదారుల అభివృద్ధి వేగవంతం'

'కూటమి పాలనలో రహదారుల అభివృద్ధి వేగవంతం'

కోనసీమ: కూటమి పాలనలో రహదారుల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. శనివారం ఆయన రూ.3 కోట్లతో నిర్మిస్తున్న వాడపాలెం రహదారి పనులను ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.