శిక్షణ విమానానికి ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
మధ్యప్రదేశ్ సివనీలో విమాన ప్రమాదం జరిగింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్ స్ట్రిప్నకు అమ్గావ్లోని పొలాల సమీపంలో నేలకూలింది. ఈ ఘటనలో విమానంలోని పైలట్ అజిత్ ఛావ్డా, మరొకరు గాయపడ్డారు. దీనిని గమనించిన స్థానికులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. విమానాన్ని ల్యాండ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.