వివాదంలో పంచాయతీ భవనం
MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో క్రీడా స్థలంలో పంచాయతీ భవనం నిర్మాణంపై వివాదం రేగింది. గ్రామసభ తీర్మానంతోనే నిర్మాణం చేపట్టినట్లు అధికారులుచెబుతున్నారు. అయితే గ్రామ సభలో అలాంటి తీర్మానం జరగలేదని యువకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. క్రీడా మైదానం స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించడం సరైనదా అని ప్రశ్నిస్తున్నారు.