అధికారులపై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్
కృష్ణా: మొవ్వ(M) కరకంపాడులో రైతుల ఇబ్బందులను మంత్రి కొలుసు పార్థసారధి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు తమ ఆవేదనను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్, డీఎంతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.