పోలీసుల బందోబస్త్ మధ్య డీజిల్ అమ్మకాలు
W.G: నరసాపురం పెట్రోల్ బంకుల వద్ద సోమవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంకుల వద్ద పహారా కాస్తున్నారు. రబీ సీజన్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ డీజిల్ దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు ప్లాస్టిక్ డబ్బాలతో బంకుల వద్ద బారులు తీరారు.