కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
NLG: నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో పెందోటి సైదులు నివాస ఆవరణంలో గురువారం రాత్రి 22 గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.గ్రామంలో కుక్కలు పెద్ద ఎత్తున స్వైర విహారం చేస్తూ మనుషులపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కుక్కలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.