VIDEO: 'గ్రామమే ముద్దు - మైనింగ్ వద్దు'

NLR: వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో మైనింగ్కు అనుమతులు ఇవ్వొద్దంటూ గ్రామస్థులు, మైనింగ్ బాధిత జేఏసీ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి మానవహారం నిర్వహించారు. 'గ్రామమే ముద్దు - మైనింగ్ వద్దు' అంటూ బాధితులు నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనతో హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.