'పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు'
ప్రకాశం: కార్తీక మాసంలో పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. నవంబర్ 9, 16వ తేదీల్లో రాత్రి 9 గంటలకు ఈ బస్సులు కనిగిరి నుంచి బయలుదేరుతాయన్నారు. ఒక టికెట్ ధర రూ.2,000లు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.