'పరిశుభ్రత పాటించని హోటళ్లపై కఠిన చర్యలు'

SRPT; హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలోని టిఫిన్ సెంటర్లపై గురువారం శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించని జానారెడ్డి టిఫిన్ సెంటర్, లక్ష్మీ నరసింహ టిఫిన్ సెంటర్లపై జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించని హోటళ్ల పై చర్యలు తప్పవని ఆయా హోటళ్ల నిర్వాహకులను హెచ్చరించారు.