శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులు భారీగా తరలొచ్చారు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,091 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,111 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.