ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించిన కార్పొరేటర్
RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని NGO'S కాలనీ స్వామి వివేకానంద పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్ను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ క్యాంటీన్లో లబ్ధిదారులకు సబ్సిడీతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం రూ. 5 కే అందించబడుతుందన్నారు. దీంతో పేద ప్రజలకు, నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.