ఉపాధి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
SS: బుక్కపట్నం మండలం కువ్వకొండ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగమ్మ మూల వద్ద చేపట్టిన ఖండిత కందకాల పనుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం కూలీల హాజరును తనిఖీ చేశారు. ఎండల దృష్ట్యా పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.