నేటి నుంచి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
NLG: కనగల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ నర్సింగ్, మురళిగౌడ్, నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు. విజేత జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. తమ జట్ల పేర్లు వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.