'రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ నిలుపుదలకు ప్రతిపాదనలు'
VZM: వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర కొత్తవలస రైల్వే స్టేషన్ను బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. అనంతరం రైల్వే క్వార్టర్స్ను సందర్శించారు. రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ నిలుపుదలకు ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.