ముంబై సిద్ధి వినాయకుడి సేవలో గంభీర్
భారత్ ఇవాళ ఇంగ్లండ్తో T20 WC సెమీస్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ సమేతంగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి సాదర స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్, ఇషాన్, అక్షర్ కూడా సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు.