'దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు'

NLG: దొంగతనం కేసులో నిందితుడు కేతావత్ బద్య(52)ను అరెస్ట్ చేశామని సీఐ నవీన్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 18న రాత్రి సమయంలో కొండమల్లేపల్లి మండలం కొర్రోని తండాలో కొర్రపట్టికి చెందిన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని కేజీ వెండి, రూ.1.50 లక్షల నగదును దోచుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.