విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.19 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.19 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి సోమవారం వివిధ సేవల ద్వారా రూ.1,19,592 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 131 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 1,700 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.