'తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు'
MHBD: వేసవి సమీపిస్తుండటంతో త్రాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి- శ్రీపాల్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 4వ వార్డులో మిషన్ భగీరధ పైపులైన్ లీకేజీలతో కొద్దిరోజులుగా త్రాగునీటి సమస్య నెలకొంది. ఈ క్రమంలో MLA రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు బుధవారం నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.