తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
TPT: తిరుమలలో ఏప్రిల్ 25 నుంచి జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల ఆకృతులతో సుమారు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారు. మూడు రోజుల పాటు గజ, అశ్వ, గరుడ వాహన సేవలతో పాటు కళ్యాణ మహోత్సవం జరగనుంది.