ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ద్రోణి కొనసాగుతున్నందున రాష్ట్రంలో నేడు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.