యుద్ధం.. టెహ్రాన్ను ఖాళీ చేసిన 10 వేల మంది
ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తమ దాడులను తీవ్రతరం చేశాయి. టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో టెహ్రాన్ను 10 వేల మంది ఖాళీ చేసినట్లు ఐరాస వెల్లడించింది. ఈ యుద్ధంతో ప్రపంచ వాణిజ్యం, ఇంధర సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది.