రొద్దంలో రేపు ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

రొద్దంలో రేపు ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో సోమవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ పర్యటించనున్నారు. ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కన్వీనర్ బి.తిమ్మయ్య కోరారు.