ముచింతల్ శిక్షణలో సర్పంచ్కు సర్టిఫికేట్
RR: స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్లో 2026 నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఐదు రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ గన్నోజు వేణుగోపాల్ రంగారెడ్డి జిల్లా డీపీవో చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ అందుకున్నారు. అనంతరం డీపీవోని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నేర్చుకున్న విషయాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.