సైబర్ నేరాలపై జాగ్రత్త: ఎస్సై

సైబర్ నేరాలపై జాగ్రత్త: ఎస్సై

KRNL: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్‌ ఫోన్లలో వచ్చే వెబ్‌సైట్‌ లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని మంత్రాలయం ఎస్సై మల్లికార్జున పిలుపునిచ్చారు. మండలంలోని బూదూరులో సీఐ రామానుజులు ఆదేశాల మేరకు ఆయన సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్‌ చేసి సమాచారం అందించాలన్నారు.