గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
VZM: రామతీర్థంలో నూతనంగా నిర్మించిన గిరిప్రదక్షిణ మార్గాన్ని ఇవాళ వర్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 3.4 కోట్ల వ్యయంతో భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, ఆనం, కొండపల్లి శ్రీనివాస్లు వర్చువల్గా హాజరయ్యారు.