ఒకే చోట క్రికెట్, ఫుట్‌బాల్ దిగ్గజాలు

ఒకే చోట క్రికెట్, ఫుట్‌బాల్ దిగ్గజాలు

వాంఖడే స్టేడియంలో దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ సందడి చేశాడు. ఆయనతో పాటు డిపాల్, సువారెజ్‌ కూడా స్టేడియానికి విచ్చేశారు. భారత్ మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఛెత్రీకి మెస్సీ తన జెర్సీని అందజేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని తన జెర్సీని మెస్సీకి అందించాడు.