మంత్రిని కలిసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
WNP: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలోని పలు పరిపాలన, అభివృద్ధి అంశాలపై కలెక్టర్ మంత్రితో మాట్లాడారు.