ములుగులో యూరియా కోసం రైతుల క్యూలు

ములుగులో యూరియా కోసం రైతుల క్యూలు

MLG: ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలోని PACS కేంద్రం వద్ద యూరియా కోసం గురువారం రైతులు వందల సంఖ్యలో బారులు తీరారు. యూరియా దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. టోకెన్లు తీసుకున్న రైతులకు యూరియా అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.