అమరావతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా నేతలు

ATP: అమరావతి పునఃప్రారంభ వేడుకలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏపీ భవిష్యత్తును మారుస్తూ, ప్రపంచ స్థాయి రాజధాని నగరానికి బీజం పడిన శుభతరుణమని నేతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు.