5 లక్షల మందితో మూడో రోజు మహానాడు!

AP: మూడో రోజు కడప శివారు చెర్లోపల్లిలో తెలుగుదేశం మహానాడు జరగనుంది. మ. 2 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా. మహానాడు వేదికగా 'మై TDP యాప్'ను ఆవిష్కరించనున్నారు. పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానానికి వీలుగా ఈ యాప్ను తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగసభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు.