కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే
SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుడు యూసుబ్కు అండగా నిలిచారు. క్యాన్సర్తో బాధపడుతున్న యూసుబ్ ఇంటికి వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి చికిత్స కోసం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. కార్యకర్తలకు కష్టాల్లో ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.