సింధూర్ తర్వాత రఫేల్పై చైనా కుయుక్తులు!
ఆపరేషన్ సింధూర్ తర్వాత రఫేల్పై చైనా కుయుక్తులు పన్నినట్లు ఓ నివేదిక తెలిపింది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి రఫేల్ యుద్ధ విమానాలపై డ్రాగన్ దేశం సోషల్ మీడియాలో నకిలీ సమాచారం వ్యాప్తి చేసిందంటూ అమెరికా సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు US-చైనా ఎకానమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన నివేదికను సమర్పించింది.