ముత్యాలమ్మ ఆలయలంలో ఘనంగా చండీ హోమం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం నర్సాపురం పట్టణానికి చెందిన మాదిరెడ్డి ఆనంద్, గాయత్రిరాణి దంపతులు ఘనంగా చండీ హోమం నిర్వహించారు. చండీ హోమం నిర్వాహకులు ఆగమ పండితులు అచ్యుత రామారావుశర్మ వేదమంత్రాలతో జరిపించారు. ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది తగిన పర్యవేక్షణ నిర్వహించారు.