నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా పటిష్ట బందోబస్తు
SRCL: నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా, చందుర్తి మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చందుర్తి సబ్ ఇన్స్పెక్టర్ జె.రమేష్ మండలంలోని అన్ని నామినేషన్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.