అనకాపల్లి జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తాం: మంత్రి

అనకాపల్లి జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పెందుర్తి, చోడవరం రోడ్డు పనుల మరమ్మతు పనుల టెండర్లు తుదిదశలో ఉన్నాయన్నారు.