ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి బీజేపీ ఇంటింటి ప్రచారం

ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి బీజేపీ ఇంటింటి ప్రచారం

E.G: రాజమండ్రి 16వ వార్డు తుమ్మగంట మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు వీధుల్లో ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా పాల్గొన్నారు.