'ఈనెల 3న ఒంగోలులో 'మీ కోసం' కార్యక్రమం'
ప్రకాశం: ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 3వ తేదీన 'మీ కోసం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అర్జీదారులు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, డీఆర్ఎ ఓబులేసు, తదితరులు పాల్గొంటారు.