లంచం తీసుకుంటూ పట్టుబడిన సానిటరీ ఇన్స్పెక్టర్
కాకినాడ: పదో సర్కిల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ను ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. తన పరిధిలోని ఓ కారు షెడ్డుకు ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేయడానికి రూ. 15,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.