చెరువులో చేప పిల్లలను వదిలిన ఏఈ
BDK: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రారంభించిందని ఏఈ సక్రు తెలిపారు. మత్స్య వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అశ్వాపురం మండలంలో గురువారం మత్స్యకారులకు ఏఈ సక్రు చేప పిల్లలను పంపిణీ చేశారు. కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో చేప పిల్లలను వదిలారు.